తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
- May 11, 2021
ఏపీ: తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కోవిడ్ వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆక్సిజన్ అందక 11మంది కరోనా రోగులు మృతి చెందారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు.మరి కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని.. వైద్యులు వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఐదు నిమిషాలు ఆలస్యం అవడంతో ఈ ఘటన జరిగినట్లు కలెక్టర్ తెలిపారు.
అయితే సమయానికి ఆక్సిజన్ రావడంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగామని కలెక్టర్ వెల్లడించారు.ఘటనా సమయంలో వార్డులో 140 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఆక్సిజన్ సరఫరా ప్రారంభించినా పరిస్థితి కుదుటపడలేదని రోగుల బంధువులు అంటున్నారు.ఆస్పత్రి వద్ద రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఐసీయూలోని వస్తువులను పగులగొట్టడంతో ఆస్పత్రిలోని నర్సులు బయటకు పరుగులు తీశారు.రోగుల బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాదకరంగా మారింది.ఇక రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









