ఆక్సిజన్ ఆన్వీల్స్ వాహనాలను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
- May 14, 2021
హైదరాబాద్: సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు కొందరు చనిపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉచిత వాహన సర్వీసును ప్రారంభించారు. మహీంద్రా లాజిస్టిక్స్ మరియు రాచకొండ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్ ఆన్ వీల్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆక్సిజన్ ఆన్వీల్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ రీఫిల్లింగ్ ప్లాంట్స్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ను సరఫరా చేయడం, ఖాళీ అయిన సిలిండర్లను రీఫిల్లింగ్ ప్లాంట్స్కు తరలించడం ఈ వాహనాల ముఖ్య ఉద్దేశం అన్నారు. వాహన సేవలు అవసరమైన వారు కోవిడ్ కంట్రోల్ నంబర్ 9490617234, మహీంద్రా లాజిస్టిక్స్ హెల్ప్లైన్ నంబర్ +91-7386420259 లో సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









