కుమారుడి నిర్వాకం పై స్పందించిన రావెల

- March 05, 2016 , by Maagulf
కుమారుడి నిర్వాకం పై స్పందించిన రావెల

 తన కుమారుడిపై కేసు నమోదైన విషయంపై మంత్రి రావెల స్పందించారు. తన కుమారుడు సుశీల్‌పై కేసు నమోదైందని, తెలంగాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని రావెల చెప్పారు. నేరం జరిగిందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరని మంత్రి రావెల స్పష్టం చేశారు. చట్టంపై, రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందని, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని రావెల అన్నారు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com