వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులతో మాట్లాడి, ధైర్యం చెప్పిన కేసీఆర్
- May 21, 2021
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు ఉన్నారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఎంజీఎంలోని సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడుగుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.వరంగల్ పర్యటనలో భాగంగ ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవలే కేసీఆర్ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







