తెలంగాణ కరోనా అప్డేట్

- May 21, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 65,997 కరోనా టెస్టులు చేయగా, 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. అటు మరో 25 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,47,727 చేరింది. మరణాల సంఖ్య 3,085కి పెరిగింది. మరోవైపు కరోనా నుంచి 4,801 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 534 మందికి కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com