బహ్రెయిన్: భారత్ కు ఆక్సిజన్ సాయం అందించిన ప్రవాసీయులు

- May 21, 2021 , by Maagulf
బహ్రెయిన్: భారత్ కు ఆక్సిజన్ సాయం అందించిన ప్రవాసీయులు

మనామా: బహ్రెయిన్ లోని తెలుగు కళాసమితి కరోనా కష్ట సమయంలో మాతృభూమికి అండగా నిలిచింది.ఇక్కడి ఇండియన్ ఎంబసీ పిలుపు మేరకు దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజెన్ సిలిండర్లు అందించింది.ఇండియన్ ఎంబసీ నేతృత్వం లో తెలుగు కళా సమితి తో పాటు ఇతర సంస్థలు,వ్యక్తుల సహకారం తో సమకూర్చిన 760 ఆక్సిజెన్ సిలిండర్లు, 10 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు తో భారతీయ నావికా దళ ఓడ ఐఎన్ యెస్ తారకాష్ మే 20 వ తారీఖున బహ్రెయిన్ నుండి బయలు దేరింది.తెలుగు కళాసమితి అధ్యక్షులు శివ ఎల్లపు మాట్లాడుతూ తమ సభ్యుల సహకారంతో ఈ కరోనా కష్ట సమయంలో తమవంతు సహకారాన్ని అందించ కలిగామని చెప్పారు.మాతృ భూమి సేవకై తెలుగు కళాసమితి ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com