భారత్ కరోనా అప్డేట్

- May 22, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 2,57,299 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో ఇప్ప‌టివ‌ర‌కు భారత్ లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,62,89,290 కి చేరింది. ఇందులో 2,30,70,365 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 29,23,400 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 4,194 మంది మృతిచెందారు.దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,95,525 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే,గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 3,57,630 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 19,33,72,819 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com