ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్..

- May 21, 2021 , by Maagulf
ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్..

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్ అయ్యాయి.ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్‌ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు ఎయిరిండియా వర్గాల సమాచారం. 2011 ఆగస్ట్‌ నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు పేర్కొన్నారు. హ్యాక్ అయిన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు సమాచారం.నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యామని ఎయిర్ ఇండియా  సిబ్బంది తెలిపింది. వెంటనే డేటా భద్రతకు సంబంధించిన పాస్‌వర్డ్స్ ను రీసెట్ చేసినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com