కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- May 22, 2021
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై జాతీయ& పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పరిమితులు విధించింది. పౌరులు, జీసీసీ పౌరులతో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఆదివారం(మే 23) నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్పీఆర్ఏ పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాలి.అదీ కూడా ప్రయాణానికి 48 గంటలలోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే బహ్రెయిన్ చేరుకున్నాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. బహ్రెయిన్ చేరుకున్న వెంటనే తొలి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఆ తర్వాత ఐదో రోజున రెండో పీసీఆర్ టెస్ట్...పదో రోజున మూడో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









