వ్యాక్సిన్ తీసుకున్న పెట్టుబడుదారులకు మాత్రమే ఎంట్రీ
- May 23, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ బౌర్స్ కార్యాలయాన్ని సందర్శించే పెట్టుబడిదారులకు సంబంధించి నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు విడుదల చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని 14 రోజులు పూర్తైన వారు మాత్రమే బహ్రెయిన్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ బారిన పడి పద్దెనిమిదేళ్లు నిండిన వారు కూడా ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించొచ్చని వెల్లడించింది. ఈ నెల 23(ఆదివారం) నుంచి జూన్ 3 వరకు ఇన్వెస్టర్లకు అనుమతి ఉంటుందని..అయితే బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి అని కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే ఇన్వెస్టర్లు ముందుగానే Skiplino యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఉన్నవారినే ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. లేదంటే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







