వ్యాక్సిన్ తీసుకున్న పెట్టుబడుదారులకు మాత్రమే ఎంట్రీ
- May 23, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ బౌర్స్ కార్యాలయాన్ని సందర్శించే పెట్టుబడిదారులకు సంబంధించి నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు విడుదల చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని 14 రోజులు పూర్తైన వారు మాత్రమే బహ్రెయిన్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ బారిన పడి పద్దెనిమిదేళ్లు నిండిన వారు కూడా ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించొచ్చని వెల్లడించింది. ఈ నెల 23(ఆదివారం) నుంచి జూన్ 3 వరకు ఇన్వెస్టర్లకు అనుమతి ఉంటుందని..అయితే బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి అని కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే ఇన్వెస్టర్లు ముందుగానే Skiplino యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఉన్నవారినే ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. లేదంటే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!









