వ్యాక్సిన్ తీసుకున్న పెట్టుబడుదారులకు మాత్రమే ఎంట్రీ
- May 23, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ బౌర్స్ కార్యాలయాన్ని సందర్శించే పెట్టుబడిదారులకు సంబంధించి నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు విడుదల చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని 14 రోజులు పూర్తైన వారు మాత్రమే బహ్రెయిన్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించేందుకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ బారిన పడి పద్దెనిమిదేళ్లు నిండిన వారు కూడా ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ సందర్శించొచ్చని వెల్లడించింది. ఈ నెల 23(ఆదివారం) నుంచి జూన్ 3 వరకు ఇన్వెస్టర్లకు అనుమతి ఉంటుందని..అయితే బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి అని కూడా స్పష్టత ఇచ్చింది. అలాగే ఇన్వెస్టర్లు ముందుగానే Skiplino యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఉన్నవారినే ఇన్వెస్టర్ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. లేదంటే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







