లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం: సీపీ సజ్జనార్‌

- May 23, 2021 , by Maagulf
లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్: లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మినహాయింపు ఇచ్చిన టైంలోనే ప్రజలు బయటికి రావాలన్నారు. గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని, చెక్ పోస్ట్‌ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని సజ్జనార్‌ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ 12వ రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో మినయింపు సమయాల్లో నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాం నగర్ ఫిష్ మార్కెట్‌లో చేపల కోసం జనం ఎగబడుతున్నారు. రద్దీని పోలీసులు నియంత్రిస్తున్నారు. మినహాయింపు సమయం కావడంతో రోడ్లపై రద్దీ 6 గంటల నుంచే ప్రారంభమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com