భారత్-యూఏఈ మధ్య విమానాలు రద్దు చేసిన విమానసంస్థ
- May 23, 2021యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను తదుపరి ఆదేశాల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ. ఈ క్రమంలో, వచ్చే నెల 14 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే...భారత్ నుంచి ప్రయాణాల ఆంక్షలు ఉండటంతో యూఏఈకి వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి నేరుగా అనుమతి లేకపోవటంతో ఇతర దేశాలకు వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత యూఏఈ వెళ్లాల్సి వస్తోంది. విమానాల రద్దుతో భారత్ లో చిక్కుకున్న వాళ్లంతా తమ ఉద్యోగాలను కొల్పోకముందే యూఏఈ చేరుకునేందుకు ఎక్కువగా అర్మేనియా, బహ్రెయిన్ మీదుగా వెళ్తున్నారు. అయితే..కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అర్మేనియా కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఈ వారంలో ముంబై, కొచ్చి
నుంచి ఆర్మేనియా చేరుకోవాల్సిన రెండు ఛార్టర్ ఫ్లైట్స్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు అర్మేనియా ప్రకటించింది. అటు బహ్రెయిన్ కూడా ఆంక్షలు కఠినతరం చేస్తూ వస్తోంది. దీంతో భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కుచించుకుపోతున్నాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం