పౌరులు, వలసదారుల్లో తగ్గుతున్న కరోనా వైరస్: ఖాలెద్ అల్ జరాల్లాహ్ వెల్లడి

- May 24, 2021 , by Maagulf
పౌరులు, వలసదారుల్లో తగ్గుతున్న కరోనా వైరస్: ఖాలెద్ అల్ జరాల్లాహ్ వెల్లడి

కువైట్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో, క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని అడ్వయిజరీ కమిటీ హెడ్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లామ్ వెల్లడించారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, ఐసీయూ అవసరం ఏర్పడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ట్విట్టర్ వేదికగా అల్ జరాల్లామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ వల్ల కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందనీ, ఒకవేళ కరోనా సోకినా దాని తీవ్రత చాలా తక్కువగా వుంటుందని చెప్పారు అల్ జరాల్లాహ్. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కొంతకాలం పాటు పాటించాల్సిందేనని ఆయన సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com