చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్నవారికి వ్యాక్సినేషన్ అందుబాటులో
- May 31, 2021రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై స్పష్టతనిచ్చింది. పౌరులు అలాగే నివాసితులు ఎవరికైతే రెసిడెన్సీ వుంటుందో వారందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో వుందని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దులాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ ప్రమాదకరమైనదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారాయన. ఎవరూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని తేల్చి చెప్పారు అబ్దులాలీ. 100 మందికి కరోనా సోకితే, 10 మంది ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందాల్సి వస్తోంది. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని వివరించారు. వ్యాక్సిన్ పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే, 100 మందికి కరోనా సోకితే.. అందులో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రావడంలేదు గనుకనే, వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పారు. కుటుంబ పరమైన వేడుకల వల్ల 75 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు అబ్దులాలి చెప్పారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..