అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం

- May 31, 2021 , by Maagulf
అప్పులకు సంబంధించిన కేసుల నిమిత్తం 51.9 మిలియన్ దిర్హాముల విడుదలకు షార్జా రూలర్ ఆమోదం

యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, పౌరులకు సంబంధించిన 99 కేసుల సెటిల్మెంట్ కోసం 51,907,000 దిర్హాముల విడుదలకు ఆమోదం తెలిపారు. షర్జా డెబిట్ సెటిల్మెంట్ కమిటీకి 20వ గ్రూప్ ఆఫ్ పేమెంట్స్ నిమిత్తం ఈ నిధులు విడుదల చేయబడతాయి. పౌరులకు స్థిరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టారు. షార్జా ఎమిరి కోర్టు అలాగే కమిటీ హెడ్ రషీద్ అహ్మద్ బిన్ అల్ షేక్ మాట్లాడుతూ, వివిధ కేటగిరీల కిందకి వచ్చే ప్రజల అప్పుల చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తొలి చెల్లింపు ద్వారా 786,786,153 దిర్హాములను 1,573 మంది లబ్దిదారుల కోసం విడుదల చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com