కరోనా చికిత్సకు రూ.5 లక్షల బ్యాంకు లోన్..
- May 31, 2021
ముంబై: కరోనా సంక్షోభంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కలిసి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనా చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల పర్సనల్ లోన్స్ ఇవ్వనున్నాయి.ఈ రుణాల కాలపరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. తమకు లేదా తమ కుటుంబసభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే వారి చికిత్స నిమిత్తం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలిపాయి.ఎస్బీఐ చీఫ్ దినేష్ ఖారా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ ఆదివారం జరిగిన ఓ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కరోనా స్పెషల్ పర్సనల్ లోన్కు ఎస్బీఐ 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేయనుందని.. ఇతర బ్యాంకులు వారి వారి పరిమితులకు లోబడి వడ్డీరేట్లను వసూలు చేస్తారని ఎస్బీఐ చీఫ్ దినేష్ ఖారా అన్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యక్తిగత రుణాన్ని ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డు ఆమోదించిందని స్పష్టం చేశారు. కనీసం రూ. 25 వేల నుంచి గరిష్టం రూ. 5 లక్షల వరకు ఈ లోన్ ద్వారా తీసుకోవచ్చునని.. ఉద్యోగం చేస్తున్నవారికి, చేయనివారికి కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.
ఇలాంటి రుణాల కోసం దరఖాస్తులు ఆఫ్లైన్లోనే తీసుకుంటారని బ్యాంకింగ్ నిపుణుడు అశ్వని రానా తెలిపారు. ఈ సౌకర్యం ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో లేదని.. కాబట్టి ఎవరైనా ఈ రుణం తీసుకోవాలనుకుంటే, దీని కోసం వారు బ్యాంకు శాఖకు వెళ్లి సంప్రదించాలన్నారు.
ఆర్బీఐ 50 వేల కోట్ల ప్రత్యేక ఫైనాన్సింగ్..గత నెల నుంచి ఇలాంటి రుణాలు పంపిణీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తోంది. అటువంటి రుణాన్ని ప్రాధాన్యత రంగ రుణాల స్థితిగా పరిగణించాలని, దాని కోసం 50 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చాలని ఆర్బీఐ పిఎస్బికి తెలిపింది. ఇందులో నాబార్డ్కు 25 వేల కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంకులకు 10 వేల కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకులకు 15,000 కోట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









