దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా...

- March 06, 2016 , by Maagulf
దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా...

దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. హస్తినలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఉదయం గుజరాత్‌లోకి పది మంది వరకు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన విషయం విదితమే. భద్రత కట్టుదిట్టం చేసిన గుజరాత్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com