భారత్ విమానాల‌ పై బ్యాన్ ఎత్తివేసిన ఆ దేశం

- June 01, 2021 , by Maagulf
భారత్ విమానాల‌ పై బ్యాన్ ఎత్తివేసిన ఆ దేశం

ఆమ్స్టర్డామ్: భారత్‌లో తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో మన దేశం నుండి వెళ్లే విమానాలను కొన్ని దేశాలు నిషేదించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జూన్ 1 నుంచి భారత్, దక్షిణాఫ్రికా, మధ్య దక్షిణ అమెరికా విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తు నెద‌ర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ దేశ అధికారులు వెల్లడించారు.ఈ రోజు నుంచి ఇది అమ‌ల్లోకి వ‌చ్చింది.నెద‌ర్లాండ్స్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో.. ఆయా దేశాల‌ నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్ వెళ్లేందుకు మార్గం సుగ‌మం అయ్యింది.అయితే, క‌రోనా కేసులు ఇంకా న‌మోదు అవుతూనే ఉండ‌డంతో..ప్రయాణానికి ముందు చేయించుకున్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నెగటివ్ రిపోర్టు చూయించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ష‌ర‌తులు పెట్టింది. అంతేకాదు..ఆ దేశంలో అడుగుపెట్టిన త‌ర్వాత‌ క్వారంటైన్ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com