తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: ప్రగతిభవన్లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్
- June 02, 2021
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన అధికారిక నివాసం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే, ఈ రోజు ఉదయం గన్పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం నాటి ఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.

మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు తెలంగాణ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.


కరోనా వేళ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు పతాకావిష్కరణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
CM Sri KCR hoisting the National Flag on the occasion of #TelanganaFormationDay at Pragathi Bhavan https://t.co/XhU2UEvYty
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2021
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







