ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్

- June 05, 2021 , by Maagulf
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్

న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది ట్విట్టర్.అసలేమైందంటే... ఈ ఉదయం వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి ఉన్న బ్లూ బ్యాడ్జిని తొలగించింది ట్విట్టర్.ఈ బ్యాడ్జి ఉంటేనే... అది నిజమైన అకౌంట్ అని నెటిజన్లు గ్రహించగలరు. బ్యాడ్జ్ లేని అకౌంట్ నిజమైనదో,నకిలీదో గుర్తించడం కష్టం.అందువల్ల బ్యాడ్జ్ తొలగించడంపై పెద్ద దుమారం రేగింది. ట్వట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం...ఎందుకు తొలగించారని ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దాదాపు ఏడాది కాలంగా...ఆ ఎకౌంట్ యాక్టివ్‌గా లేదనీ... అందువల్లే బ్యాడ్జి తొలగించామని ట్విట్టర్ చెప్పింది.ఐతే...వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక...తన సమాచారం అంతా...అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ... అంత మాత్రాన...యాక్టివ్‌గా లేనట్లు కాదని...చెప్పడంతో...ట్విట్టర్...తన తప్పును సరిచేసుకుంది. మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి... చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆయన అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అదే సమయంలో...ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు.వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తొలగించడం ద్వారా... పెను దుమారానికి తెరతీసిన ట్విట్టర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com