అరెస్ట్ అయినాక పారిపోతే అదనంగా రెండేళ్ల జైలు శిక్ష
- June 05, 2021
యూఏఈ: ఏ నేరంలోనైనా నిందితులుగా అరెస్టైన వ్యక్తులు పారిపోవటానికి ప్రయత్నిస్తే అదనపు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అరెస్టు సమయంలో పారిపోయినా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు వెల్లడించింది.దీంతో పాటు కస్టడీకి కూడా అప్పగించేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇద్దరు లేదా అంతకుమించి వ్యక్తులు నేరానికి పాల్పడినప్పుడు, బెదిరింపులు, విధ్వంసాలకు పాల్పడిన కేసుల్లో పెనాల్టి జైలు శిక్ష రూపంలో ఉంటుందని స్పష్టం చేసింది.నేర తీవ్రత, ఉపయోగించిన ఆయుధాలను బట్టి ఐదేళ్లకు మించకుండా జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







