వ్యాక్సిన్ తో కరోనా ముప్పు తక్కువగా ఉంటుంది: ఎయిమ్స్
- June 05, 2021
న్యూ ఢిల్లీ: వ్యాక్సిన్ తో కరోనా ముప్పు తక్కువగా ఉంటుంది. ఒక డోసు తీసుకున్న వారిలో కరోనా సోకినా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇక రెండు డోసులు తీసుకుంటే మరణ ముప్పు తక్కువగా ఉంటుందని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన 63 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ నిపుణులు గమనిస్తూ వచ్చారు. వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 53 మంది కోవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
రెండు డోసులు తీసుకున్న వారిలో 52.8శాతం మంది, ఒక్క డోసు తీసుకున్న వారిలో 47.2 శాతం మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.వీరికి 5 నుంచి 7 రోజుల పాటు జ్వరం వచ్చినా, తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు లేవని నిపుణులు గుర్తించారు.అయితే టీకా వేయించుకున్నా మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. వైరస్ పై పోరాటంలో టీకా ఒక ఆయుధమని ఎయిమ్స్ నిపుణులు వివరించారు. కరోనా ఒకరినుంచి మరొకరికి సంక్రమించే వైరస్ కాబట్టి కోవిడ్ వచ్చిన వారు మిగిలిన వారితో కలవకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







