జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీల నుండి బకాయిలు రాబట్టుకోవడం ఎలా?
- June 05, 2021
తెలంగాణ: 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవుపేటలో శనివారం నాడు గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమం జరిగింది.

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మాటేటి స్వామిగ్రామ సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ - రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, పలువురు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. దుబాయి నుండి వాపస్ వచ్చిన లోక ఆదిరెడ్డి తనకు జీతం బకాయిలు ఇప్పించాలని కోరారు.
కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ +91 62817 63686 కు పంపించాలని యూనియన్ నాయకులు కోరారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







