జీతాలు ఎగవేసిన గల్ఫ్ కంపెనీల నుండి బకాయిలు రాబట్టుకోవడం ఎలా?
- June 05, 2021
తెలంగాణ: 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవుపేటలో శనివారం నాడు గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమం జరిగింది.

ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మాటేటి స్వామిగ్రామ సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ - రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, పలువురు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. దుబాయి నుండి వాపస్ వచ్చిన లోక ఆదిరెడ్డి తనకు జీతం బకాయిలు ఇప్పించాలని కోరారు.
కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ +91 62817 63686 కు పంపించాలని యూనియన్ నాయకులు కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







