అన్ లాక్ బాటలో మహారాష్ట్ర..
- June 05, 2021
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. సోమవారం నుంచి ఐదంచెల అన్లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాల్లో మినహాయింపు పరిమితులను నిర్ణయించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం కరోనా పరిస్థితులను ప్రజారోగ్య శాఖ సమీక్షించనుంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్లాక్ మొదటి స్థాయిలో కనీస పరిమితులు ఉండగా, ఐదవ స్థాయిలో అధిక పరిమితులతో అన్ లాక్ ప్రక్రియను ఆచరిస్తారు.
ఆయా జిల్లాలో ఐదు శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో, లేదా 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ పడకలు ఉన్న ప్రాంతాల్లో మొదటి స్థాయి పరిమితులు విధిస్తారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతినిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. వివాహాలు, అంత్యక్రియలకు అనుమతులుంటాయి. లోకల్ రైళ్లు కూడా నడుస్తాయి.
ఇక, రెండు, మూడు, నాలుగు స్థాయిల్లో పాజిటివిటీ రేటు ఆధారంగా సడలింపులు నిర్ణయించారు. ఐదవ స్థాయిలో పరిస్థితి ఇంచుమించు లాక్డౌన్ మాదిరిగానే ఉంటుంది. నిత్యావసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. మాల్స్, షాపింగ్ సెంటర్లు, జిమ్లు మూసివేసే వుంచుతారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







