బుర్కినా ఫాసోలో 114 మంది కాల్చివేత
- June 06, 2021
నైమే: బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలోని ఒక గ్రామంలో జిహాదీలు ఘాతుకానికి పాల్పడ్డారు. గ్రామస్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సుమారు 114 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2015 అనంతరం దేశంలో జరిగిన ఘోరమైన దాడి ఇదేనని తెలిపింది. సహేల్ ప్రాంతం యాఘా ప్రావిన్స్లోని సోల్హాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఔస్సేని టాంబౌరా తెలిపారు. ఈ కాల్పులకు జిహదీలే కారణమని అన్నారు. దాడిలో మార్కెట్ సహా పలు ఇళ్లు దగ్ధమయ్యాయాని అన్నారు. క్షతగాత్రులు సెబ్బా పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాంతాన్ని సుమారు 5,000 మంది ఫ్రాన్స్ సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ.. ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









