బుర్కినా ఫాసోలో 114 మంది కాల్చివేత
- June 06, 2021
నైమే: బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలోని ఒక గ్రామంలో జిహాదీలు ఘాతుకానికి పాల్పడ్డారు. గ్రామస్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సుమారు 114 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2015 అనంతరం దేశంలో జరిగిన ఘోరమైన దాడి ఇదేనని తెలిపింది. సహేల్ ప్రాంతం యాఘా ప్రావిన్స్లోని సోల్హాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఔస్సేని టాంబౌరా తెలిపారు. ఈ కాల్పులకు జిహదీలే కారణమని అన్నారు. దాడిలో మార్కెట్ సహా పలు ఇళ్లు దగ్ధమయ్యాయాని అన్నారు. క్షతగాత్రులు సెబ్బా పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాంతాన్ని సుమారు 5,000 మంది ఫ్రాన్స్ సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ.. ఈ దాడి జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







