మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది సజీవ దహనం

- June 07, 2021 , by Maagulf
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది సజీవ దహనం

ముంబై: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో ఫైర్ సిబ్బంది ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో సహా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియ రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com