మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- April 13, 2026
ఇంగ్లాండ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.ఈ టోర్నీలో మొత్తం రూ.81 కోట్లను (87,64,615 డాలర్లు) బహుమతిగా అందించనున్నారు.
2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ ఫండ్ 10 శాతం పెరిగింది. గత ఎడిషన్లో 10 జట్లు పాల్గొనగా, ఈసారి పోటీలో జట్ల సంఖ్య 12కు చేరింది. 2024లో మొత్తం ప్రైజ్ మనీ రూ.70 కోట్లుగా ఉండగా, జట్ల పెరుగుదలకు అనుగుణంగా ఐసీసీ నిధులను కూడా భారీగా పెంచింది.
ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకునే విజేత జట్టుకు రూ.21.8 కోట్లు లభించనున్నాయి. ఫైనల్ వరకు వచ్చి రన్నరప్గా నిలిచే జట్టుకు రూ.10 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్ వరకు చేరుకుని ఓటమి పాలైన జట్లకు కూడా భారీ మొత్తంలో అంటే రూ.6 కోట్ల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.
కేవలం విజేతలకే కాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు ఐసీసీ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి రూ.29 లక్షలు అదనంగా అందుతాయి. అంతేకాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లను కేటాయించారు.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









