మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- April 13, 2026
ఇంగ్లాండ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం మునుపెన్నడూ లేని విధంగా భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.ఈ టోర్నీలో మొత్తం రూ.81 కోట్లను (87,64,615 డాలర్లు) బహుమతిగా అందించనున్నారు.
2024లో యూఏఈలో జరిగిన టోర్నమెంట్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ ఫండ్ 10 శాతం పెరిగింది. గత ఎడిషన్లో 10 జట్లు పాల్గొనగా, ఈసారి పోటీలో జట్ల సంఖ్య 12కు చేరింది. 2024లో మొత్తం ప్రైజ్ మనీ రూ.70 కోట్లుగా ఉండగా, జట్ల పెరుగుదలకు అనుగుణంగా ఐసీసీ నిధులను కూడా భారీగా పెంచింది.
ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకునే విజేత జట్టుకు రూ.21.8 కోట్లు లభించనున్నాయి. ఫైనల్ వరకు వచ్చి రన్నరప్గా నిలిచే జట్టుకు రూ.10 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్ వరకు చేరుకుని ఓటమి పాలైన జట్లకు కూడా భారీ మొత్తంలో అంటే రూ.6 కోట్ల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.
కేవలం విజేతలకే కాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు ఐసీసీ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి రూ.29 లక్షలు అదనంగా అందుతాయి. అంతేకాకుండా, టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లను కేటాయించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







