జూన్ 9న కువైట్ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి
- June 08, 2021
కువైట్ సిటీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రేపు (జూన్ 9) కువైట్లో పర్యటించనున్నారు. కువైట్-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపరిచేలా ఆయన ప్రధాని మోదీ సందేశాన్ని కువైట్ కు అందజేస్తారు. అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా కువైట్ కొత్త రూలర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి తొలి అధికారిక పర్యటన ఇదే కావటం విశేషం. షేక్ సబా అల్-అహ్మద్ అల్-సబా మరణం తరువాత, హెచ్ హెచ్ షేక్ నవాఫ్ గత సెప్టెంబర్ లో కొత్త పాలకుడిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..గతేడాది మార్చిలో కువైట్ విదేశాంగ మంత్రి అహ్మద్ నాజర్ అల్ మహ్మద్ అల్-సబా భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాత భారత్ వైపు నుంచి తొలి అధికారిక పర్యటన ఇది. పలు క్లిష్ట పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో రాజకీయంగా, సాంకేతికంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మైత్రి బంధాన్ని బలపర్చుకున్న ఇరు దేశాలు, భవిష్యత్తులో తమ మైత్రిని మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో జైశంకర్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని లేఖ ద్వారా పంపిన సందేశాన్ని కువైట్ రూలర్ కు అందజేస్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









