ట్రావెల్ బ్యాన్ ఎత్తివేతకు సానుకూల పరిస్థితులు, ప్రవాసీయుల్లో ఊరట
- June 08, 2021
ఒమన్: సెలవులకు, ఇతర కారణాలతో ఒమన్ నుంచి సొంత దేశాలకు వెళ్లిన వారు ట్రావెల్ బ్యాన్ తో ఆయా దేశాల్లోనే చిక్కుకొని పోయారు. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో ఒమన్ పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించటంతో నెలల తరబడి వాళ్లంతా మాతృదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా చిక్కుకుపోయిన వాళ్లంతా తమ తమ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు ఎత్తివేస్తారో..తిరిగి ఒమన్ చేరుకొని ఎప్పుడు ఉద్యోగాల్లో చేరుతామోనని ఎదురు చూపుల్లో ఉన్నారు. అలాంటి వాళ్లందరకీ ప్రస్తుత పరిస్థితులు కొంతమేర సానుకూలంగా కనిపిస్తున్నాయి. వైరస్ తీవ్రతను బట్టి ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, సుడాన్, ఈజిప్ట్, టాంజానియాతో సహా 15 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది ఒమన్. అయితే..కొద్ది రోజులుగా భారత్ లో కోవిడ్ పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మే మొదటి వారంలో గరిష్టంగా 4,15,000 కోవిడ్ కేసులు నమోదవగా..రాను రాను పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతూ జూన్ 7 నాటికి లక్ష లోపు నమోదయ్యాయి. అటు పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ లో కూడా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. దీంతో ట్రావెల్ బ్యాన్ దేశాల లిస్ట్ నుంచి ఆయా దేశాలకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే ఒమన్ భారత్ తో పాటు మరికొన్ని దేశాల నుంచి ప్రయాణికులను అనుమతిస్తారనే అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









