నిరాడంబరంగా జరగనున్న పూరి జగన్నాధ్ ర‌థ‌యాత్ర‌

- June 10, 2021 , by Maagulf
నిరాడంబరంగా జరగనున్న పూరి జగన్నాధ్ ర‌థ‌యాత్ర‌

భువ‌నేశ్వ‌ర్: ఈ ఏడాది కూడా భ‌క్తులు లేకుండానే.. కోవిడ్ నియ‌మావ‌ళితో పూరిలో జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌ సాగుతుంద‌ని ఒడిశా స్పెష‌ల్ రిలీఫ్ క‌మీస‌న‌ర్ ప్ర‌దీప్ కే జెనా తెలిపారు. కేవ‌లం ఆల‌య అర్చ‌కులు, కొద్ది మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌న్నారు. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది కూడా సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర సాగింది. జూలై 12వ తేదీన పూరిలో ర‌థ‌యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ర‌థ‌యాత్ర‌ను నిషేధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com