బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
- June 11, 2021
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది.ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే… క్రాక్లో జయమ్మ పాత్రకు జీవంపోసిన శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి… బాలయ్య బాబు చిత్రంలోనూ ఓ కీ-రోల్ పోషించబోతోందని తెలుస్తోంది. మన కథానాయికలు కొందరికి కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు లభిస్తున్నట్టుగానే…వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో దర్శక నిర్మాతలు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు.దాంతో కొంతకాలంగా వర తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే తెనాలి రామకృష్ణ మూవీలో నటించిన వరలక్ష్మి ఈ యేడాది క్రాక్తో పాటు నాందిలోనూ అద్బుతమైన పాత్రను పోషించి, నటిగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్ని దోచుకుంది. ఇక మాస్ హీరో బాలకృష్ణ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వర ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







