అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

- June 11, 2021 , by Maagulf
అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా,తెలుగు కళాసమితి ఒమన్,సంతోషం ఫిలిం న్యూస్,శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో 75వ జయంతి సందర్భంగా 10 మంది గాయకులచే 75  పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం జరగబోతుంది.

ఆదివారం 13 జూన్ సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 06:00 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్ అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయని అమెరికా గాన కోకిల శారద ఆకునూరి  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.సంతోష్ ఫిలిం న్యూస్.,TRINET,తెలుగు కళాసమితి ఒమన్  ద్వారా ప్రసారం చేయబడుతుంది. 

అతిధులుగా,సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవపెద్ది సురేష్,వీణాపాణి,సినీ గీత రచయతలు భువన చంద్ర,సిరాశ్రీ
రవిప్రకాష్,UK నుండి డా.నగేష్ చెన్నుపాటి,సురేష్ కొండేటి,ఒమన్ నుండి అనిల్ కుమార్ కడించెర్ల,హరి వేణుగోపాల్ పాల్గొంటున్నారు.

 గాయకులు రామాచారి,వినోద్ బాబు,రాము,ప్రవీణ్ కుమార్,వేణు శ్రీరంగం 
సాందీప్.పవన్ చరణ్,హరి గుంట,విపంచి శశిధర్,ధనుంజయ్ బాలు 75 పాటలను మనకు వీనులవిందుగా వినిపించనున్నారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com