పద్మ పురస్కారాలకు నామినేష‌న్ల చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 15…

- June 11, 2021 , by Maagulf
పద్మ పురస్కారాలకు నామినేష‌న్ల చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 15…

న్యూ ఢిల్లీ: ఆయా రంగాల్లో విశేష‌మైన సేవ‌లందించ‌న వారికి భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డులు అందిస్తోంద‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కేంద్రం ఈ అవార్డుల‌ను అందిస్తుంది.క‌ళ‌లు, సాహిత్యం, విద్య‌, ఆట‌లు, వైద్యం,సామాజిక సేవ‌, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి రంగాలలో విశిష్టమైన,అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డును ఇస్తారు.ఈ క్ర‌మంలోనే 2022 ప‌ద్మ అవార్డుల కోసం నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ కొన‌సాగుతోంది.మీకు తెలిసిన గొప్ప వ్య‌క్తుల‌ను ప‌ద్మ అవార్డుల‌కు సిఫార్సు చేయాల‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.ఈ క్ర‌మంలోనే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు 2021 సెప్టెంబర్ 15ను చివ‌రి తేదీగా నిర్ణ‌యిస్తూ.. కేంద్ర హోంశాఖ ప్ర‌క‌ట‌న చేసింది. ప‌ద్మ అవార్డుల నామినేష‌న్లు, సిఫార్సులు ఆన్‌లైన్‌లో ప‌ద్మ అవార్డుల పోర్ట‌ల్ https://padmaawards.gov.in లో స్వీక‌రిస్తామ‌ని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com