దుబాయ్: ఫార్మసీ దోపిడి కేసులో ముగ్గురికి జైలుశిక్ష
- June 12, 2021
దుబాయ్: ఓ ఫార్మసీలో దోపిడికి పాల్పడిన ముగ్గురు సభ్యుల ఆసియా గ్యాంగ్ కు జైలు శిక్ష పడింది. నేరం నిర్ధారణ కావటంతో ముగ్గురికి ఏడాది జైలుశిక్ష, Dhs4,000 జరిమానాతో పాటు శిక్షా కాలం ముగిసిన తర్వాత వారిపై దేశబహిష్కరణ అమలు చేయాలని దుబాయ్ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మార్చిలో దుబాయ్ లోని రిక్కి ప్రాంతంలో దోషులు దోపిడికి పాల్పడ్డారు. తాను ఫార్మసీలో విధులు నిర్వహిస్తుండగా ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు మొదటి షాపులోకి వచ్చి మందులు కొన్నారని బాధితుడు కోర్టుకు తెలిపాడు. తాను మందులు ఇచ్చి డబ్బులు క్యాష్ బాక్స్ డ్రాలో వేస్తున్న సమయంలో ఇద్దరిలో ఓ వ్యక్తి కత్తితో తనను బెదిరించాడని, మరో వ్యక్తి తనపై కారం చల్లాడని, అంతలోనే మూడో వ్యక్తి కూడా ఫార్మసీలోకి దూసుకొచ్చి దోపిడి పాల్పడ్డాడని వివరించాడు. తాను ఎదురు తిరిగినా, తన భుజంపై కత్తితో దాడి చేసి క్యాష్ బాక్స్ డ్రాలో నుంచి Dhs4,000 డబ్బు దోచుకెళ్లినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు చేసిన పోలీసులు ఆసియా గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావటంతో దుబాయ్ కోర్టు దోషులకు శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







