చైనా: గ్యాస్ పేలుడు ఘటనలో 11 మంది మృతి
- June 13, 2021
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్లో భారీ గ్యాస్ పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా...37మంది తీవ్రగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటన ఆదివారం ఉదయం 6.30 షియాన్ సిటీలోని జంగ్వాన్ జిల్లాలో జరిగింది. స్థానిక మార్కెట్పై ఈ పేలుడు తీవ్ర ప్రభావాన్ని చూపిందని సిజిటిఎన్-టివి పేర్కొంది. అనేక మంది నివాసితులు అల్పాహారం చేసేందుకు, కూరగాయలకు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు తరచూ ఇక్కడకు వస్తారని పేర్కొంది.ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది. మొత్తంగా మృతులతో సహా 144 మందిని వెలికి తీశారని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







