చైనా: గ్యాస్ పేలుడు ఘటనలో 11 మంది మృతి
- June 13, 2021బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్లో భారీ గ్యాస్ పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా...37మంది తీవ్రగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటన ఆదివారం ఉదయం 6.30 షియాన్ సిటీలోని జంగ్వాన్ జిల్లాలో జరిగింది. స్థానిక మార్కెట్పై ఈ పేలుడు తీవ్ర ప్రభావాన్ని చూపిందని సిజిటిఎన్-టివి పేర్కొంది. అనేక మంది నివాసితులు అల్పాహారం చేసేందుకు, కూరగాయలకు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు తరచూ ఇక్కడకు వస్తారని పేర్కొంది.ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది. మొత్తంగా మృతులతో సహా 144 మందిని వెలికి తీశారని సమాచారం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి