చైనా: గ్యాస్‌ పేలుడు ఘటనలో 11 మంది మృతి

- June 13, 2021 , by Maagulf
చైనా: గ్యాస్‌ పేలుడు ఘటనలో 11 మంది మృతి

బీజింగ్‌: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్‌ చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో భారీ గ్యాస్‌ పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా...37మంది తీవ్రగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటన ఆదివారం ఉదయం 6.30 షియాన్‌ సిటీలోని జంగ్వాన్‌ జిల్లాలో జరిగింది. స్థానిక మార్కెట్‌పై ఈ పేలుడు తీవ్ర ప్రభావాన్ని చూపిందని సిజిటిఎన్‌-టివి పేర్కొంది. అనేక మంది నివాసితులు అల్పాహారం చేసేందుకు, కూరగాయలకు మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు తరచూ ఇక్కడకు వస్తారని పేర్కొంది.ఈ పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని భావించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని పేర్కొంది. మొత్తంగా మృతులతో సహా 144 మందిని వెలికి తీశారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com