బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్

- June 14, 2021 , by Maagulf
బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్

ఢిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

ఈటలతో పాటు మరికొందరు నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.

పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈటల చెప్పారు. సోమవారం ఉదయం ఈటల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com