బాలు ఉంటే కరోనా సమయంలో కళాకారులను ఆదుకునేవారు

- June 14, 2021 , by Maagulf
బాలు ఉంటే కరోనా సమయంలో కళాకారులను ఆదుకునేవారు

హైదరాబాద్: కరోనా సమయంలో కళాకారులు కార్యక్రమాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.అదే కనుక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉంటే ఎందరికో సహకరించి సహాయం చేసి  ఆదుకునేవారు.. ఎందరో కళాకారులను ఆదుకున్న మహానుభావుడు మనందరికీ దూరమయ్యారని కళాబ్రహ్మ,సేవా మహాత్మ, శిరోమణి,డాక్టర్ వంశీ రామరాజు అన్నారు.. అమెరికా హ్యూస్టన్ లో  అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయకురాలు "అమెరికా గానకోకిల " ఆధ్వర్యంలో జరిగిన ఎస్పి 75వ జయంతి కార్యక్రమంలో వంశీ రామరాజు, ఎస్పీ తో వంశీ - వేగేశ్న సంస్థలకున్న అనుబంధం తెలియజేస్తూ దివ్యాంగుల సేవయే మాధవ సేవ గా భావించేవారని అన్నారు.. ఎదుటివారి బాధను తన బాధగా  భావించిన ఎస్పి గొప్ప మానవతావాది అని ఏ ఎం రాజా స్వర్ణ కంకణం బహుకరిస్తే ఆ కంకణాన్ని దివ్యాంగుల భోజనానికి ఉపయోగించమని వేగేశ్న ఫౌండేషన్ కి ఇచ్చారని తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com