సోనియా గాంధీతో తమిళనాడు సీఎం స్టాలిన్ భేటీ
- June 18, 2021
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమావేశమయ్యారు.ఇవ్వాళ ఆయన తన భార్యతో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు.తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక సోనియాతో స్టాలిన్ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా రాష్ట్ర రాజకీయ, అధికార పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
స్టాలిన్, ఆయన భార్య దుర్గావతి స్టాలిన్ తో సమావేశమవడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు, తమిళనాడు అభివృద్ధికి డీఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమైన సంగతి తెలిసిందే.ఆ సమావేశంలో భాగంగా సీఏఏ, సాగు చట్టాలు, నీట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా టీకాల సరఫరా, జీఎస్టీ పరిహారం చెల్లింపు, శ్రీలంక తమిళులకు హక్కులు వంటి విషయాలపైనా చర్చించారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









