పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన సిబ్బందితో ‘ఢిల్లీ నుంచి దుబాయ్’కి తొలి విమానం
- June 18, 2021
దుబాయ్: ఢిల్లీ - దుబాయ్ మార్గంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తొలి అంతర్జాతీయ విమానాన్ని పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన సిబ్బంది ద్వారా నడపడం ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ఉదయం 10.40 నిమిషాలకు బయల్దేరిన విమాన సిబ్బంది పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందారు. కెప్టెన్ డి.ఆర్. గుప్తా, కెప్టెన్ అలోక్ కుమార్ నాయక్ ఈ విమానాన్ని నడిపారు. క్యాబిన్ క్రూ మెంబర్స్ వెంకట్ కెల్లా, ప్రవీణ్ చంద్ర, ప్రవీణ్ చౌగ్లే మరియు మనీషా కాంబ్లెలతో విమానం బయల్దేరింది. అర్హులైన క్రూ మెంబర్స్ అలాగే ఫ్రంట్ లైన్ స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ చేయించినట్లు ఎయిర్ లైన్ సంస్థ వెల్లడించింది. వందే భారత్ మిషన్ ప్రారంభమయ్యాక ఓ విమానం పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన సిబ్బందితో ఇండియా నుంచి ఆపరేట్ అవడం తమతోనే మొదలైందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







