'ఓకే టు బోర్డ్' అంటే ఏమిటి?
- March 07, 2016
దుబాయ్కి వెళ్ళే ప్రయాణీకులు తమ వీసా వెరిఫికేషన్ని పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత, సంబంధిత అధికారి 'ఓకే టు బోర్డ్' మెసేజ్ని పిఎన్ఆర్లో ఇన్సెర్ట్ చేస్తారు. భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారంతా 'ఓకే టు బోర్డ్'ను పొందవలసి ఉంటుంది. యూఏఈ (దుబాయ్, షార్జా మరియు అబుదాబీ)కి వెళ్ళాలనుకుంటే పిఎన్ఆర్ ఖచ్చితంగా 'ఓకే టు బోర్డ్' అనే మార్కింగ్ పొందవలసి ఉంటుంది. వీసా వచ్చిన తర్వాత వీసా కాపీని ఎయిర్లైన్కి రీ-చెకింగ్ కోసం పంపాలి. వీసాని చెక్ చేసిన తర్వాత ఎయిర్లైన్స్ సంస్థ అప్రూవల్ ఇస్తుంది. ఓకే టు బోర్డ్ అని లేకపోతే ప్రయాణానికి అనుమతించరు. యూఏఈకి వెళుతున్నవారిలో చాలామంది ఫేక్ వీసాల ద్వారా వెళ్తుండడంతోనే ఈ చర్యలను చేపట్టారు. మామూలుగా అయితే సంబంధిత స్పాన్సరర్లు 'ఓకే టు బోర్డ్'ని పూర్తి చేస్తారు. వారే పిఎన్ఆర్ మరియు చెల్లబాటు అయ్యే వీసా కాపీని ఎయిర్లైన్స్ అధికారులకు పంపుతారు. ఎయిర్లైన్స్ సంస్థ వెరిఫై చేసి, 'ఓకే టు బోర్డ్' మెసేజ్ని పిఎన్ఆర్లో పేర్కొంటుంది.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







