అల వైకుంఠపురములో రీమేక్లో మనీషా కోయిరాలా..!
- June 20, 2021
మన తెలుగు సినిమాలు వివిధ భాషలలో రీమేక్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతుండగా, ఈ రీమేక్కు దర్శకుడు డేవిడ్ ధావన్ ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసాడట. ప్రస్తుతం సినిమాలో నటినటుల ఎంపిక జరుగుతుంది.

అలవైకుంఠపురంలో నటించిన అల్లు అర్జున్ – పూజాహెగ్డే పాత్రల్లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ ఎంపికయ్యారు. ఇక తల్లి క్యారెక్టర్ కోసం తెలుగులో టబు పోషించిన పాత్రని సీనియర్ బ్యూటీ మనీషా కోయిరాల చేయనుందట. ముందుగా టబునే అనుకున్నప్పటికీ ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడం వలన మనీషా కోయిరాలతో దర్శకనిర్మాతలు చర్చలు జరిపారట. అయితే ఆల్రెడీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రాబోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







