కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ రికార్డ్
- June 20, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ రికార్డ్ నెలకొల్పింది. సాయంత్రం 4 గంటలకే 10.93 లక్షల మందికి పైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ జరుగుతోంది.కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్పై దృష్టిపెట్టింది.వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది.కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,25,679 వ్యాక్సిన్లు వేయగా, అత్యల్పంగా విజయనగరంలో 48,689 వ్యాక్సిన్ డోసులు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1, 21,389, కృష్ణా: 1,08,730,విశాఖ: 94, 913, శ్రీకాకుళం: 77,742, గుంటూరు: 80,857, నెల్లూరు: 70, 359, ప్రకాశం: 73, 759, చిత్తూరు: 72,544, కర్నూలు: 60, 669, అనంత: 56, 811, కడప: 50, 091 డోసులు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









