భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ
- June 21, 2021
యూఏఈ: ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్, భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో విక్రయించబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందినదేనని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్నవారు భారతదేశం నుంచి యూఏఈకి వస్తే, వ్యాక్సినేషన్ పొందినట్లు గుర్తిస్తారా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సందేహాలకు యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ అని.. యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణీకుల్ని, తగిన ప్రోటోకాల్స్ అనుగుణంగా అనుమతిస్తామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







