ఇతర దేశాల్లో నుంచి కూడా ఆన్ లైన్లో రెసిడెన్సీ రెన్యూవల్
- June 22, 2021
కువైట్: అన్ని రకాల వీసాదారులు ఇక నుంచి ఆన్ లైన్లో కూడా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చని జనరల్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ స్పష్టం చేసింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుబడిపోయిన ప్రవాసీయుల కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంటే ట్రావెల్ బ్యాన్ కారణంగా కువైట్ ప్రవాసీయులు వారి వారి సొంత దేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి వారు ఏ ఇబ్బంది లేకుండా అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లోనే రెసిడెన్సీ పర్మిట్ రెన్యూవల్ చేసుకునేందుకు వీలుంటుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా కువైట్ వెలుపల ఉన్న ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ అవకాశం లేదనే వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. అలాగే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు కువైట్ లో లేని ప్రవాసీయులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ పర్మిట్ గడువు ఉన్నంత కాలం వారిని కువైట్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిపై ఎలాంటి నిషేధం ఉండదన్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం కువైట్లో రెండు లక్షల మంది ప్రవాసీయులు రెసిడెన్సీ రెన్యూవల్ లేకుండా అక్రమంగా ఉంటున్నారని, వారిపై రెండు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







