వ్యాక్సిన్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- June 23, 2021
కువైట్: ట్రావెల్ బ్యాన్ తో చిక్కుకుపోయిన భారతీయుల ప్రయాణ అడ్డంకులను తొలగించేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టింది. అలాగే ఇతర ప్రయాణ అడ్డంకులపై ఫోకస్ చేసింది. ఆగస్ట్ 1 నుంచి భారత్ పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు కువైట్ మంత్రిమండలి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి ఎంబసీ అధికారులు భారతీయుల ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా భారతీయ ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నారా..లేదా..తీసుకుంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ వివరాలను సేకరించటంతో పాటు ప్రయాణానికి కావాల్సిన ఇతర అంశాలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని..సంబంధిత కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులను తొలగించటమే ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం. భారత ప్రయాణికులుhttp://https://forms.gle/ZgRpFBTFV5V24Vqb8 ద్వారా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని ఎంబసీ కార్యాలయం కోరింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









