అక్రమ శాటిలైట్ డిషెస్ తొలగింపుకు డెడ్లైన్
- March 08, 2016sడిస్కవరీ గార్డెర్స్లో నివాసం ఉంటోన్నవారికి నఖీల్ మార్చ్ 10వ తేదీని డెడ్లైన్గా నిర్ణయించింది. వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ డిషెస్ లేదా యాంటినాస్ని రూఫ్స్ మరియు బాల్కనీల నుంచి తొలగించాలనీ, లేదంటే భారీగా జరీమానాలు విధింపబడ్తాయనీ నఖీల్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. నఖీల్ ఫెసిలిటీస్ మరియు ఓనర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి నోటీసులను జారీ చేసింది. 20,000 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్తో అతి పెద్ద కమ్యూనిటీగా ఉంది ఇది. అక్రమంగా డిష్లను ఏర్పాటు చేస్తే 500 దిర్హామ్ల వరకు ఫైన్ విధించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. 2015 మార్చ్లో అబుదాబీ మున్సిపాలిటీ 2000 దిర్హామ్ల ఫైన్ని అక్రమ డిష్లు వినియోగించేవారికి విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షార్జాలో ఈ ఫైన్ 500 దిర్హామ్లుగా ఉంది. షార్జాలో 1997లోనే డిష్ యాంటెనాలపై నిషేధం ఉంది. 2012 నుంచి శాటిలైట్ టీవీ డిష్ల కోసం నిబంధనను సవరించి, కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం