వ్యాక్సిన్ పొందిన వాళ్లకే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి
- June 25, 2021
కువైట్: రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పబ్లిక్ ప్లేసులలో ప్రజా సంచారంపై ఆంక్షలు విధిస్తోంది కువైట్ ప్రభుత్వం. కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి ఉంటుందని ప్రకటించింది. జూన్ 27 ఆదివారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. వ్యాక్సిన్ పొందిన వారే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతించేలా కువైట్ ప్రభుత్వం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దింపనుంది. 6000 స్క్వైర్ మీటర్ల కంటే ఎక్కువగా ఉండే మాల్స్ తో పాటు రెస్టారెంట్లు, కేఫ్ లు, జిమ్ములు, షాప్స్ దగ్గర ఈ బృందాలు తమ విధులు నిర్వహించనున్నాయి. కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇటీవలి కాలంలో కువైట్ లో వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారిన పడుతుండటంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పబ్లిక్ ప్లేసులలో ఎంట్రీకి వ్యాక్సిన్ తో లింక్ పెట్టింది ఆరోగ్య శాఖ.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







