చైనా పాఠ‌శాల‌లో అగ్నిప్ర‌మాదం...18మంది మృతి!

- June 25, 2021 , by Maagulf
చైనా పాఠ‌శాల‌లో అగ్నిప్ర‌మాదం...18మంది మృతి!

చైనా: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు నగరంలోని జెచెంగ్‌ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. తెల్లవారు జామున కావడంటతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించకపోవడంతోనే ఇంత భారీస్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తుంది.

ఇప్పటికి ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 16 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 13న సెంట్రల్‌ హుబెయి ప్రావిన్స్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణ లోపాలుతోనే ఆ ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com