Delta Plus: ఏపీలో తొలి కేసు నమోదు

- June 25, 2021 , by Maagulf
Delta Plus: ఏపీలో తొలి కేసు నమోదు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి డెల్టా ప్లస్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్‌ కేసు నమోదైందని తెలిపారు. అయితే డెల్టా ప్లస్‌ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తి అయిందని.. బాధితుడి నుంచి ఇతరులెవరికీ వ్యాపించలేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. బ్లాక్‌ ఫంగస్‌, డెల్టా ప్లస్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com