వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి

- June 29, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ప్రాంతాల్లోకి అనుమతి

అబుధాబి: వ్యాక్సిన్ తీసుకున్న వారినే కొన్ని పబ్లిక్ ప్రాంతాలకు అనుమతి ఉంటుందని అబుధాబి విపత్తులు, అత్యవసర నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఆగస్ట్ 20 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఆలోగా అబుధాబిలోని లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపుల్లో 93 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని అంచనా వేస్తోంది. 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది కనుక..కొన్ని పబ్లిక్ ప్రాంతాల్లోకి కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతి ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వం పేర్కొన్న పబ్లిక్ ప్రాంతాల జాబితాలో షాపింగ్ సెంటర్స్, రెస్టారెంట్లు, కేఫ్ లు, జిమ్ములు, రిక్రియేషన్ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, షాపింగ్ సెంటర్స్ వెలుపలు ఉన్న రిటేల్ ఔట్ లెట్స్ ఉన్నాయి. అలాగే క్లబ్బులు, రిసార్ట్స్, మ్యూజియమ్స్, థీమ్ పార్క్, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల్లోకి ఆగస్ట్ 20 నుంచి వ్యాక్సిన్ పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులు, మినహాయింపు పొందిన వారు, 15 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com